ఘనమైన చారిత్రక కీర్తి ఉన్న మహోబా ఉత్తర ప్రదేశ్ లోని చిన్న జిల్లా. చందేలా పాలనలో సృష్టించబడిన శృంగారభరితమైన శిల్పాలు అలాగే గుహలకి ప్రసిద్దమైన ఖజురహో తో బందేల్ ఖండ్ ప్రాంతం లో ఉన్న మహోబా సాంస్కృతిక మూలాలు కలుస్తాయి. బందేల్ ఖండ్ ప్రాంతాన్ని పాలించిన చందేల్ రాజ పుత్రుల రాజధానిగా మహోబా వ్యవహరించేది. 'మహోత్సావ్ నగర్' (పండుగల నగరం) అనే పదం నుండి మహోబా అనే పదం వచ్చింది.
మహోబా లో ఉన్న పర్యాటక ఆకర్షణలు
ఎన్నో స్మారక చిహ్నాలకు, భవనాలకు అలాగే ఆధ్యాత్మిక ప్రాంతాలకు మహోబా ఒక నివాసం. తాండవ భంగిమలో శివుని విగ్రహం కలిగిన శివుని ఆలయం గుఖర్ పర్వతాల యొక్క అందాలని అలాగే ఆ చుట్టు పక్కల ప్రాంతాల యొక్క అందాలని తలదన్నేలా ఉంటుంది. మదన్ సాగర్ లేక్ పై ఉన్న ఒక ద్వీపం పై ఉన్న కక్రమథ్ ఆలయం కూడా భక్తులని ఆకర్షించడంలో ముందుంది. రహిలా సాగర్ కి పశ్చిమాన ఉన్న తొమ్మిదవ శతాబ్దపు మందిరం రహీల సాగర్ సన్ టెంపుల్. హిందువులు, జైనుల మరియు బౌద్ధుల మందిరాలు కలిగిన గోఖర్ పర్వతాన్ని ఇంకా చంద్రికా దేవి ఆలయన్ని తప్పక సందర్శించాల్సిందే.
మహోబా కి ఎలా చేరాలి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా మహోబా కి సులభంగా చేరవచ్చు.
వాతావరణం ఉప ఉష్ణమండల వాతావరణం కలిగిన మహోబాలో తీవ్రమైన వేసవికాలం, శీతాకాలం అలాగే వర్షాకాలం తమ ప్రభావాన్ని చూపిస్తాయి.