మజూలి లోని పర్యాటకులు సందర్శించే ప్రసిద్ధ ప్రాంతాలలో బొంగోరి ఒకటి. అస్సాంకి అహోం వంశ౦ 600 ఏళ్ళకు పైగా పాలించిన ఘనమైన చరిత్ర ఉంది. బొంగోరి అనేక చిన్న సత్రాలను కల్గి అస్సాం సుసంపన్న వారసత్వాన్ని వీక్షించే అవకాశాన్ని అందిస్తుంది.
ఈ ప్రాంత జీవవైవిధ్యం మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది, ఎందుకంటే ఆధునికతలోని దుష్పభావాలకు దూరంగా వారి పూర్వీకులు తరతరాలుగా పూర్తి సామరస్య౦తో ప్రకృతితో సహాజీవనం చేసినట్లే ఇక్కడ ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు.
అస్సాం పర్యటన సమయంలో పూర్తి ప్రశాంతత, నిర్మలత్వాన్ని కోరుకొనే వారికి ఈ ప్రాంతం ఒక పరిపూర్ణ ముఖద్వారం.