జాముల ఆలయం, ఈ ప్రాంతంలో నివసించినట్లు భావించే జాముల రిషి దేవతా అనే యోగికి అంకితం చేయబడింది. కథానుసారం, ధ్యానం కోసం సరైన స్థలం శోధిస్తూ, అతను వివిధ దేవతల 18 చిత్రాలు గల ఒక సంచిని తన వెంట తీసుకువచ్చాడు. తన అన్వేషణలో, ఒక సందర్భంలో చిత్రాలు సంచి నుంచి గాలికి ఎగిరి బియాస్ లోయ అంతటా వ్యాపించాయి. ఆ చిత్రాలు పడిన 18 ప్రదేశాలు, స్థానికులకు పవిత్ర ప్రదేశాలుగా మారాయి. ప్రస్తుతం, ఈ ఆలయం ఏదైనా విషయం లేదా వివాదంలో చివరి నిర్ణయం తీసుకునే న్యాయస్థానంగా పనిచేస్తుంది.