చిన్న చిన్న ద్వీపాల సమూహం తో విస్తరించివున్న కదలుండి పక్షి సంరక్షణ కేంద్రం మలప్పురం జిల్లా లో తప్పక చూడవలసిన ప్రదేశం. కదలుండి నది, అరేబియా సముద్రాన్ని కలిసే సాగర సంగమ స్థలికి కాస్త ముందుగా ఒక వ్యూహాత్మక ప్రదేశం లో ఇది ఉంది. ఈ సంరక్షణ కేంద్రం ఉన్న కదలుండి అనే అందమైన పల్లెని రహదారి గుండా చేరుకోవటం అతి సులభం.ఈ సంరక్షణ కేంద్రం ఎన్నో రకాల వలస పక్షులకు తాత్కాలిక ఆవాసంగా మారుతుంది. 200 మీటర్ల ఎత్తు తో , ఎత్తు పల్లాల కొండల మధ్యలోనున్న కదలుండి పక్షి సంరక్షణ కేంద్రం విహంగ వీక్షకులకు ఒక మరపురాని అనుభూతిని అందిస్తుంది. మలబార్ ఇబెరితలు , వడ్రంగి పిట్టలు, డార్టర్స్, వింబ్రెల్స్, కాకులు , కొంగలు, ఉల్లంకులు, ప్లోవెర్స్, లకుముకిపిట్టలు, భాహ్మినీ గద్దలు లాంటి వివిధ పక్షి జాతులను ఇక్కడ చూడవచ్చు.అక్టోబర్ నించి మార్చ్ నెల మధ్య కాలం సంరక్షణ కేంద్రం చూడటానికి అత్యుత్తమ సమయం. ఇక్కడ పడవ షికారు సదుపాయం కూడా ఉంది. పక్షులు మాత్రమే కాక, ఇక్కడ చేపలు, తాబేళ్లు, పీతలు, నత్తలు లాంటి సముద్ర జాతులు కూడా ఉంటాయి.