కేరళదేశ్ పురం ఆలయం దక్షిణ భారత దేశంలోని ప్రాచీన చారిత్రాత్మక హిందూ దేవాలయం. ఇది తానూర్ పట్టణానికి 3 కి.మీ ల దూరం లో ఉంది. మలప్పురం జిల్లా లోని తీర పట్టణమైన తానూర్ పురాతన పోర్చుగీసు స్థావరం. ఈ ప్రాచీన దేవాలయం లో శ్రీ మహా విష్ణువు పూజలందుకుంటాడు. చరిత్రానుసారం ఈ ఆలయం 16 వ శతాబ్ధం మధ్య భాగం లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సందర్శించాడు. తరువాత మైసూరు టిపు సుల్తాన్ చేత ధ్వంసం చేయబడింది. ఇపుడు కనిపిస్తున్నది పునరుద్ధరించిన నిర్మాణం.తానూర్ సముద్ర తీర సమీపాన గల ఈ ఆలయం సందర్శకులకు ప్రశాంత వాతావరణం అందిస్తుంది. ఆలయ గోడలపైన ఉన్నఅపురూపమైన కుడ్య చిత్రాలు (మ్యూరల్స్) ఇక్కడి విశిష్టత. మలయాళ మాసం "వృశ్చికం" లో ఇక్కడి ప్రధాన వార్షిక ఉత్సవం జరుగుతుంది. ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లోని ఇతర ముఖ్య ప్రదేశాలు తిక్కైకట్టు ఆలయం, మఠం, శోభ పరంబు దేవి ఆలయం, వెట్టక్కోరుమకన్ ఆలయం.