వాదభండేశ్వర దేవాలయం శిల్ప కళకు ప్రసిద్ధి చెందింది. మాల్పే సముద్ర తీరంలో ఉంది. ఈ దేవాలయంలో బలరామ క్రిష్ణులు ఉంటారు. ఈ దేవాలయాన్ని అనంతేశ్వర దేవాలయం అని కూడా అంటారు. ఇతిహాసం మేరకు దీనిలోని విగ్రహాలను మాధవాచార్య ప్రతిష్టించాడని చెపుతారు.
హిందూ భక్తులు సాధారణంగా ఈ దేవాలయాన్ని పౌర్ణమి లేదా మహాలయ అమవాశ్య దినాలలో దర్శించి ప్రార్ధన చేస్తారు. సముద్రంలో స్నానాలు చేస్తారు. వాదభండేశ్వర దేవాలయం ఉడుపి కి పడమరగా 4 మైళ్ళ దూరంలో ఉంది. రోడ్డుపై కూడా వెళ్ళవచ్చు. బస్ లు, ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.