"హైయెస్ట్ జీపబెల్ రోడ్ ఇన్ ది వరల్డ్" గా ప్రసిద్ది చెందిన రోహతంగ్ పాస్, ఏంతో మంది పర్యాటకులచే ఎండాకాలం లో ఎక్కువగా సందర్శించబడే ప్రాంతం. మనాలి నుండి 51 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రాంతం కులూ ని లహౌల్ మరియు స్పిటి తో అనుసంధానం చేస్తుంది. సముద్ర మట్టం నుండి 4111 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం నుండి అందమైన పర్వతాలు, మనోహరమైన ప్రకృతి దృశ్యాలు మరియు గ్లేసియర్ లు కనువిందు చేస్తాయి. పర్యాటక ప్రాంతాలకి ప్రవేశ ద్వారం గా వ్యవహరించడమే కాకుండా రోహతంగ్ పాస్ ట్రెక్కింగ్ లకి అనువైన ప్రాంతం గా కూడా ప్రసిద్ది చెందింది. మౌంటెన్ బైకింగ్, పారాగ్లైడింగ్ మరియు స్కైంగ్ వంటి ఆక్టివిటీస్ లని పర్యాటకులు చేపట్టొచ్చు.
మే లో తెరచుకునే ఈ పాస్ సెప్టెంబర్ లో భారీ మంచు వల్ల మూసివేయబడుతుంది. రోహతంగ్ పాస్ ద్వారా చేసే ప్రయాణం భారీ వర్షపాతం మరియు అధిక వేగంతో వీచే గాలుల వల్ల కొంచెం ప్రమాదకరమే. ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకునే పర్యాటకులు వారి ప్రయాణం సురక్షితంగా ఉండేందుకు ముందుగా ఇండియన్ ఆర్మీ నుండి అనుమతి తీసుకోవాలి.