'వారణాసి ఆఫ్ హిల్స్' గా ప్రసిద్ది చెందిన మండి బీస్ నది ఒడ్డున హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న పేరొందిన జిల్లా. చారిత్రాత్మక నగరమైన మండి ఇంతకు పూర్వం మాండవ్ అనే గొప్ప మహర్షి మాండవ్ పేరుతో మాండవ్ నగర్ గా పిలువబడేది.
రాతి ఆలయాలకు ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతం లో హిందూ దేవతలైన శివ మరియు కాళి ఆలయాలు 300 లకు పైగా ఉన్నాయి. పంచవక్త్రా ఆలయం, అర్ధనారీశ్వర టెంపుల్, త్రిలోకనాథ్ టెంపుల్ ఇక్కడున్న కొన్ని ప్రసిద్దమైన ప్రాచీన ఆలయాలు.
మండిలో ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన అతి ప్రాచీన ఆలయం భూతనాథ్. ఇది 1520 లో నిర్మించబడినది. గురుద్వారా గోవింద్ సింగ్ కూడా అధిక మంది పర్యాటకులని ఆకర్షించడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. సముద్ర మట్టం నుండి 11500 అడుగుల ఎత్తులో ఉన్న షికారి పీక్ మండిలో ఉన్న మరొక ప్రధాన పర్యాటక మజిలీ.'షికారి దేవి పీక్' గా కూడా పిలువబడే ఈ శిఖరం పైన షికారి దేవి ఆలయం ఉంది.
సంకేన్ గార్డెన్, డిస్ట్రిక్ట్ లైబ్రరీ బిల్డింగ్, విజయ్ కేసరి బ్రిడ్జి, పాండో లేక్, సుందర్నగర్, ప్రసార్ లేక్, జన్జ్హేలి, రాణి అమ్రిత్ కౌర్ పార్క్, బీర్ మొనాస్టరీ మరియు నర్గు వైల్డ్ లైఫ్ సాంచురీ లు ఈ ప్రాంతంలో ఉన్న మరికొన్ని ప్రముఖమైన పర్యాటక ఆకర్షణలు. మండిని సందర్శించే పర్యాటకులలో షికారి దేవి వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా అమితమైన ప్రాచుర్యం పొందింది. వివిధ రకాల జంతు జాలాలైన గోరల్, మోనాల్, బ్లాక్-బీర్, బార్కింగ్ డీర్, మస్క్ డీర్, హిమాలయన్ బ్లాకు బీర్, కాట్, చిరుత మరియు హిమాలయన్ పామ్ సివెట్ వంటి వాటికి ఈ సాంచురీ నివాసం.
ఈ ప్రాంతానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. మార్చ్ నుండి అక్టోబర్ వరకు మండి ని సందర్శించేందుకు అనువైన సమయం.