బీస్ నది ఒడ్డున ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం భీమ కాళీ టెంపుల్. మండి యొక్క బుశాహర్ కులదేవత అయిన భీమ కాళీ కి ఈ ఆలయం అంకితమివ్వబడింది. అందమైన నిర్మాణ శైలిని ప్రతిబింబించే ఈ ఆలయం లోవివిధ దేవతా మరియు దేవుళ్ళ విగ్రహాలు మరియు చిత్రాలు కలిగిన పెద్ద మ్యూజియం ఉంది. హిందూ దైవం కృష్ణుడు, రాక్షసుడు అయిన బానాసురుడితో ఈ ప్రాంతం లోనే యుద్ధం చేసి ఆ రాక్షసుడి తల పూడ్చి వేశాడని పురాణాలూ చెబుతున్నాయి.
యాదవ రాజులచే నిర్మించబడిన ఈ ఆలయం నుండి అందమైన శ్రీఖండ్ పర్వత శిఖరం కనపడుతుంది. ప్రతి సంవత్సరం కాళీ పూజ పండుగ నాడు ఎంతో మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.