10 వ సిఖ్ గురు అయిన గురు గోబింద్ సింగ్ కి అంకితమివ్వబడినది ఈ గురుద్వారా గోబింద్ సింగ్. గురు గోబింద్ సింగ్ ఆధ్వర్యం లో నే సిక్కు సంఘాలు ఏకమయ్యి మొఘల్ రాజు అయిన ఔరంగజేబ్ తో పోరాడారు. ఈ యుద్ధం జరిగే సమయం లో, గురు గోబింద్ సింగ్ కి రాష్ట్ర రాజు వద్ద నుండి అపారమైన సహకారం లభించింది. బీస్ నది ఒడ్డున ఉన్న ఈ గురుద్వారా ని గురుద్వారా పాలంగ్ సహబాస్ గా కూడా పిలుస్తారు. ఈ గురుద్వారా లో గురు గోబింద్ సింగ్ విరామం పొందిన మంచం కూడా ఉంది. గురు గోబింద్ సింగ్ వదిన రబాబ్ అనే సంగీత వాయిద్యం, ఒక తుపాకీ, గన్ కప్పి లు ఇక్కడ పొందు పరిచారు. గురుద్వారా కి పక్కనే ఉన్న ఇక్కడ ఉన్న పెద్ద వాటర్ ట్యాంక్ లో ఔషద గుణాలు ఉన్నాయని అంటారు. గురుద్వారా యొక్క లోపలి అలంకరణలు రాజవంశీకులు చూసుకునేవారు.