రాయి మరియు చెక్కతో నిర్మించబడిన ఏడూ అంతస్తుల కోటకి ఈ పంగన - కర్సోగ్ వాలీ ప్రసిద్ది. ఈ కోట లోపల ఉన్న మహామయ ఆలయం లో ఏడాది పొడవునా ఎంతో మంది యాత్రికులను ఆకర్షిస్తోంది.
సముద్ర మట్టం నుండి 350 మీటర్ల ఎత్తులో ఉన్న కర్సోగ్, మండి జిల్లాలోని సబ్ డివిషనల్ హెడ్ క్వార్టర్. పురాణాల ప్రకారం, మహాభారత ఇతిహాసంలో పాండవులలో ఒకడైన భీముడు ఈ ప్రాంతం లో నే హిడింబ ని వివాహమాడాడని అంటారు. బౌల్ ఆకారం లో ఉండే ఈ వాలీ చుట్టూ ఎన్నో ఆపిల్ చెట్ల తోటలు ఈ ప్రాంతాన్ని సుందరంగా కనిపించేలా చేస్తాయి. కామాక్షి దేవి టెంపుల్, మామ్లేశ్వర్ మహాదేవ టెంపుల్ మరియు మహునగ్ టెంపుల్ లు ఈ ప్రాంతం అందాలని రెట్టింపు చేస్తాయి. ఈ ప్రాంతం లో ట్రెక్కింగ్ అనేది ప్రాచుర్యం చెందిన ఆక్టివిటీ. ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్యలో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం.