హిమాచల్ ప్రదేశ్ లో మండి జిల్లాలో ఉన్న షికారి దేవి టెంపుల్ హిందువులకు ప్రముఖమైన ఆధ్యాత్మిక మందిరం. ఇది సముద్ర మట్టం నుండి 2850 మీటర్ల ఎత్తులో ఉంది. షికారి దేవి పీక్ పైన ఉన్న ఈ ప్రాచీన ఆలయానికి పై కప్పు ఉండదు. పురాణాల ప్రకారం, ఈ ఆలయానికి పై కప్పు నిర్మించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. షికారి దేవి ని అంకితమివ్వబడిన ఈ ఆలయం జన్జ్హేలి నుండి 15 కిలోమీటర్ల దూరం లో ఉంది. ప్రధాన ట్రెక్కింగ్ బేస్ క్యాంపు ఇక్కడే ఉండడం వల్ల సందర్శకులు షికారి దేవి పీక్ కి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు.