మండి లో పర్యాటకులని అమితంగా ఆకట్టుకునే ఆక్టివిటీ ల లో ట్రెక్కింగ్ ప్రముఖమైనది. గొప్ప హిమాలయ మంచు పర్వతాల పైన, చుట్టూ ఆకుపచ్చని అడవుల తో ఉన్న మండి ట్రెక్కింగ్ కు అనువైన ప్రదేశం.
ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఎండాకాలం అనువైన సమయం. ఎందుకంటే ఈ సమయం లో వాతావరణం ఆహ్లాదకరం గా ఉంటుంది. శీతాకాలం లో కూడా ఈ ప్రాంతం అనుభవజ్ఞులైన ట్రెక్కింగ్ పర్యాటకులకి ఈ ప్రాంతం అనువైనదే అని చెప్పుకోవచ్చు. కాకపోతే వారికీ కూడా కొంచెం కష్టం తప్పదు.