బౌద్ధ ఆశ్రమాలుగా సేవలందిస్తున్న ఈ తొమ్మిది గుహలు; బాఘ్ గుహలు మండుకు సమీపంలో ఉన్నాయి. ఈ గుహల లోపలిభాగపు గోడల అందమైన అలంకారం మండులో తప్పనిసరిగా చూసితీరవలసినదే. ఈ గుహలు 400-700 AD కాలంనాటివి. ఈ గుహలలోని చిత్రలేఖనాలు గడచిపోయిన కాలం మరియు ప్రకృతి వినాశనాలలకు తట్టుకుని ఇప్పటివరకు ఉన్నాయంటే అవి యెంత గొప్పవో తెలుస్తున్నది.
ఈ ఆశ్రమాలను 'గుహలు' అనే అనటం అంత సరిఅయినది కాదు,ఇవి సహజంగా ఏర్పడినవి కాదు, మానవ నిర్మితాలు; వీటిని వింధ్య ముఖంగా రాతిని సహజలంబంగా చెక్కారు. ఈ గుహలు, వీటి నిర్మాణంలో అజంతా గుహలను పోలి ఉన్నాయి. అన్ని గుహలలో ఒకే రకమైన చతుర్ముఖ గదులు మరియు చివరలో ప్రార్థన హాల్ గా ఉపయోగించే ఒక చిన్న గది ఉన్నాయి. ఈ గుహలలో వేల సంవత్సరాలనాటి చిత్రపటాలను చూసితీరవలసిందే.