17 వ శతాబ్దంలో రాజా జగత్ సింగ్ నిర్మించిన రామచంద్ర దేవాలయం హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఒక ఇతిహాసం ప్రకారం విష్ణువు ఏడవ అవతారం, అయోధ్యా రాజు రామచంద్రుడు ఈ గుడిని అయోధ్య నుంచి మణికరణ్ కు మార్చాడు.
ఈ గుడి చరిత్ర గుడి గోడల్లోని ఒకదాని పై రాసి వుంది, ఐతే ఇప్పుడది సరిగ్గా కనబడదు. ఈ గుడిని 1889 లో రాజా దిలీప్ సింగ్ పునరుద్ధరించగా, ఇప్పుడు దీన్ని ఒక ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ గుడిలో మూడు హాళ్ళు, యాత్రికుల కోసం నలభై గదులూ వున్నాయి.