హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ లో వున్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం శ్రీ గురు నానక్ దేవ్ జీ గురుద్వారా. జ్ఞాని జ్ఞాన్ సింగ్ రాసిన ‘త్వారిఖ్ గురు ఖాల్స’ లోని వాక్యాల ప్రకారం గురు నానక్ దేవ్ ఈ ప్రాంత సంరక్షణ కోసం తన అయిదుగురు శిష్యులతో కలిసి ఈ మణికరణ్ సందర్శించారు.
ఇక్కడ ‘లంగర్’ లేదా ఉచిత సామూహిక ఆహారం కోసం తన శిష్యులలో ఒకరైన భాయి మర్దానా ను గురు నానక్ పిండి, పప్పు దినుసులు మణికరణ్ వాసుల నుంచి సేకరించమని ఆదేశించారు. తరువాత, అతను కూర్చున్న పక్కనే వున్న రాయిని తీసుకోమని అతనికి చెప్పారు. అదే స్థలంలో ఒక వేడి నీటి బుగ్గ బయటికి ఉబికింది. ఈ బుగ్గ ను ఇప్పటికీ చూడవచ్చు - ఈ నీటినే ఇప్పటికీ ‘లంగర్’ తయారీకి వాడుతున్నారు. మణికరణ్ సందర్శించే యాత్రికులు ఈ వేడి నీటి బుగ్గలో మునకలు వేసి ఆ నీటిని తాగుతారు. ఇక్కడ స్నానం చేస్తే మోక్ష౦ సాధించడానికి ఉపయోగపడుతుందని స్థానికులు నమ్ముతారు.
మహాభారతాన్ని రాసిన వేదవ్యాస మహర్షి తన భవిష్య పురాణంలో గురు నానక్ సందర్శన తరువాత, 11 మంది సిక్కు గురువులలో పడవ వాడైన గురు గోవింద్ సింగ్ తన ‘పంచ ప్యారాలు’ లేదా అయిదుగురు ప్రియశిష్యులతో మణికరణ్ సందర్శిస్తాడని రాసాడు.