హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ లో వున్న పురాతన దేవాలయం శివాలయం.లయకారకుడైన శివుడు, సృష్టికారకుడు బ్రహ్మ, స్థితి కారకుడు విష్ణువు కలిసి త్రిమూర్తులుగా వ్యవహరింపబడతారు. 1905 లో రిక్టర్ స్కేల్ పై 8.0 తీవ్రత తో వచ్చిన భూకంపం తరువాత ఈ గుడి కొద్దిగా ఒరిగింది. కులు లోయ నుంచి దేవతలు వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శిస్తారని ప్రజలు నమ్ముతారు. ఈ గుడి అందువల్ల పర్యాటకులతో బాటు అనేకమంది హిందూ భక్తులను కూడా ఏడాది పొడవునా ఆకర్షిస్తుంది.