మంత్రాలయం దక్షిణ భారత దేశ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో ఉంది. ఈ పట్టణం తుంగభద్ర నదీ తీరంలో ఉంది. కర్ణాటక రాష్ట్రం తో సరిహద్దు పంచుకుంటుంది. ఈ పట్టణం మంచాలే అనే పేరు తో ప్రసిద్ధికెక్కింది.గురు రాఘవేంద్ర స్వామి నిర్మించిన బృందావనం వల్ల తెలుగు వారిలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. శ్రీ మధ్వాచార్యులుని నాయకునిగా పరిగణించే మధ్వ సన్యాసుల శాఖ ను అనుసరించిన పవిత్ర వ్యక్తి గురూజీ.
స్థానికుల నమ్మిక ప్రకారం, గురు రాఘవేంద్ర స్వామి దక్షిణ బృందావనం లో గత 339 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. మరో 361 సంవత్సరాలు ఇక్కడే నివసిస్తారు. గురూజీ బృందావనం లో అడుగుపెట్టినప్పుడే ఆ ప్రదేశాన్ని 700 సంవత్సరాల పాటు తన ఆవాసం గా స్వీకరిస్తానని ప్రకటించారు. ఈ కారణం చేత దేశం లోని హిందువులచే ఇది పవిత్ర పట్టణం గా పరిగణించబడుతుంది.
మంత్రాలయం లోని ఆసక్తికరమైన ప్రదేశాల్లో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం, బిక్షాలయ గుడి, పంచముఖి ఆంజనేయ ఆలయం ఉన్నాయి. ఈ పట్టణం లో విమానాశ్రయం లేదు, అయితే ఇక్కడికి రహదారి గుండా లేక రైలు మార్గంలోనూ సునాయాసంగా చేరుకోవచ్చు. పట్టణం యొక్క కేంద్ర ప్రదేశం నుంచి రైల్వే స్టేషన్ సుమారు 16 కి.మీల దూరంలో ఉంది. మంత్రాలయం చేరుకోవటానికి ఎన్నో ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఈ ప్రదేశంలో ఉష్ణ మండల వాతావరణం నెలకొని ఉంది. వేసవులు చాలా వేడిగా, పొడిగా, శీతాకాలాలు కాస్త చల్లగా ఉంటాయి.