స్థానిక భాష లో బిచాలి గా పిలవబడే బిక్షాలయ, మంత్రాలయానికి సుమారు 20 కి.మీల దూరంలో ఉంది. శ్రీ అప్పనాచార్య జీవితం లో అధిక భాగం ఇక్కడే జీవించిన ప్రదేశం గా దీనికి పేరు. శ్రీ అప్పనాచార్య గురు రాఘవేంద్ర స్వామి కి పరమ భక్తుడే గాక శిష్యుడు కూడా. గురు రాఘవేంద్ర స్వామి బిక్షాలయ లో శ్రీ అప్పనాచార్య తో పాటు 13 సంవత్సరాలు జీవించారన్న విషయం విదితమే.
తుంగభద్ర నదీ తీర ప్రాంతపు అత్యద్భుతమైన అందాల మధ్యల ఉండటం వల్ల బిక్షాలయలో పచ్చ పచ్చని మరియు ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంది. నగర జీవనపు ఉరుకులు పరుగులు నుంచి తప్పించుకోవటానికి నేడు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ చోటు వారికి ధ్యానం చేసుకుని తమ అంతర్గత వ్యక్తులను తెలుసుకునేందుకు కావలసిన శాంతిని, ప్రశాంత పరిసరాలను అందిస్తుంది.
బిక్షాలయ యాత్రికులకు, దగ్గరి వారితో అమూల్యమైన క్షణాలు గడపడానికి విహారయాత్ర కై వచ్చే స్థానికులకు ఇష్టమైన ప్రదేశంగా మారిపోయింది.