పంచముఖి ఆంజనేయ ఆలయం మంత్రాలయం పట్టణం నుంచి సుమారు 5 కి.మీల దూరం లో ఉంది. ఆంజనేయ స్వామి లేదా హనుమాన్ ఈ ఆలయంలోని ఆరాధ్య దైవం. ఇక్కడి విగ్రహానికి గరుడ, నరసింహ స్వామి, హయగ్రీవ, హనుమాన్ మరియు వరాహ స్వాములను ప్రాతినిధ్యం వహిస్తూ అయిదు తలలు ఉంటాయి.
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి శ్రీ రామునికి మరియు హనుమాన్ కి గొప్ప భక్తుడని నమ్ముతారు. 12 సంవత్సరాల ఘోర తపస్సుకు మెచ్చి హనుమాన్ గురూజీ కి ప్రత్యక్షమయ్యారు. హనుమాన్ గురూజీ కి పంచముఖి ఆంజనేయునిగా దర్శనమిచ్చారు.
అత్యంత అందమైనది కావటం వల్ల ఈ ఆలయం యాత్రికుల తప్పక చూడవలసిన ప్రదేశాల జాబితా లో ఉంటుంది. రాళ్ల మధ్య ఉన్నా సుందరమైన నిర్మలమైన భూభాగం మీద ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయానికి వెళ్ళే దారి లో మీకు మంచం, తలగడ, దేవతల విమానం లాంటి సహజ ఆకృతి లో ఉన్న రాళ్ళు ఎదురుపడతాయి.