మధుర లోని ద్వారకాధీశ టెంపుల్ ను గ్వాలియర్ రాజాస్థానం లోని కోశాధి కారి క్రి.శ.1814లో ప్రసిద్ధ విశ్రాం ఘాట్ సమీపంలో నిర్మించాడు. శ్రీ కృష్ణుడిని ద్వారక రాజు లేదా ‘ద్వారకాదీశుడు’ అని కూడా అంటారు. కనుక ఆ పేరు తోనే ఈ గుడిని నిర్మించారు. ఇపుడు ఈ టెంపుల్ ని వల్లభాచార్య తెగ నిర్వహిస్తోంది. ఈ టెంపుల్ లో రాధాకృష్ణుల విగ్రహాలు ఇతర దేముళ్ళు, దేవతలు, అందమైన ఇతర శిల్పాలు పెయింటింగ్ లు వుంటాయి.
ఈ టెంపుల్ కు ప్రతి రోజూ వేల సంఖ్య లో భక్తులు వస్తారు. పండుగలపుడు మరింత ఆధికంగా వస్తారు. స్థానికులు వర్షాకాలం మొదటిలో వచ్చే శ్రావణ మాసంలో ఇక్కడ పెద్ద ఉత్సవం చేస్తారు.