ప్రసిద్ధి చెందిన కృష్ణ జన్మ భూమి టెంపుల్ హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఈ టెంపుల్ లోని చెరసాల వంటి నిర్మాణంలో కృష్ణుడు జన్మించాడని చెపుతారు. జహంగీర్ పాలనలో ఈ టెంపుల్ ను రాజ వీర్ సింగ్ బుందేలా నిర్మించాడని చెపుతారు. అయితే, మరొక కధనం మేరకు, ఈ టెంపుల్ మొదటి సారిగా సుమారు 5000 సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణుడి ముని మనుమడు కట్టించాడని కూడా చెపుతారు. దాని వైభవ దశలో టెంపుల్ ను వర్ణించటం అలవి కాలేదని చెపుతారు.
ఒరిజినల్ టెంపుల్ ను క్రి.శ. 1017లో మహమ్మద్ గజినీ ధ్వంసం చేసాడు. అక్కడకల ఇతర బౌద్ధ ఆరామాలను కూడా నాశనం చేసాడు. కాల క్రమేణా టెంపుల్ నిర్మాణంలో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న టెంపుల్ పూర్తిగా హిందూ శిల్ప శైలి కలిగి వుంది. ఔరంగజేబ్ పాలనలో దీని ప్రాధాన్యత తగ్గించేందుకు గాను పక్కనే ఒక పెద్ద మసీదు కట్టారు.