మైలదుతరై లోని కురుకై శివన్ దేవాలయంలో శివుడు మూడో కన్ను తెరిచి కనిపిస్తాడు. మన్మధుడిని కాల్చివేయడానికి శివుడు తన మూడో కన్ను తెరిచింది ఇక్కడేనని నమ్ముతారు. శివుడికి కోపం వస్తే తన కంటికి కనిపించేంత దూరంలో వున్న అన్నిటినీ కాల్చి బూడిద చేయగల శక్తి వుంది. ఆయన శరీరంలో వున్న మూడో కన్ను వల్ల భక్తులు ఆయన్ను గౌరవిస్తారు, భయపడతారు కూడా. మహాభారతంలో శివుడి మూడో కన్నుకు సంబంధించిన కథ వుంది. పార్వతి సరదాగా శివుడి కళ్ళను వెనక నుంచి మూసి ఉంచింది. ఆలా ఆయన కళ్ళు మూయగానే లోకమంతా చీకటైపోయింది.
అప్పుడు శివుడి ఫాల భాగం నుంచి ఒక జ్వాలలా మూడో కన్ను ఉదయించడంతో లోకంలో తిరిగి వెలుగు నిండింది. ఈ మూడో కన్ను కేవలం అంతర్ముఖంగానే వుంటుంది, కానీ బయటకు చూస్తె అది వినాశకారిగా మారుతుంది. శివుడి మూడో కన్ను తెరవడం వల్ల మన్మథుడు కాలి బూడిదయ్యాడు. ఇక్కడి శివుడిని త్రినేత్ర, త్రయంబక, త్ర్యక్ష, త్రినయన అని పిలవడం వల్ల సామాన్య భక్తుడికి శివుడి కోపం, అపారమైన శక్తి గుర్తుకు వస్తాయి.