కూరైనాడు లో వున్న పునుగీశ్వరార్ దేవాలయం శివుడు, ఆయన భార్య శాంత నాయకి కోసం నిర్మించారు. ఇక్కడే మోక్షం పొందిన పునుకు సిధ్ధార్ పేరిట ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చింది. సిద్దార్లు గా పిలువబడే ఎంతో మంది సాధువులకు మైలదుత్తరై నిలయం. మైలదుతరై మహాంగల్ లాంటి కావ్యాలు ఈ పట్టణంలోను , పరిసరాలలోనూ జీవించిన మహాత్ముల గురించి వర్ణిస్తాయి. మైలదుతరై శివార్లలో గతంలో అనేక మంది సాధువులు నివాసం వున్న కారణంగా ఆ ఊరిని ఇప్పటికీ సిద్దార్కాడు అని పిలుస్తారు.
దేవాలయాలు వున్న కాంచీపురం లాగానే కూరైనాడు కూడా ఆధ్యాత్మికంగానే కాక వస్త్ర వ్యాపారానికి కూడా సుప్రసిద్ధం. కాంచీపురం కంచి పట్టుచీరలకు ప్రసిద్ది చెందినట్టే కూరైనాడు అతుకు లేకుండా నేసిన రెండు నిడువుల తొమ్మిది అడుగుల చీరలకు పెట్టింది పేరు. కూరై అంటే తమిళంలో వస్త్రం అని అర్ధం – దీంతో కూరైనాడు, చీరలు ఎంత విడదీయరానివో తెలుస్తూనే వుంది. కూరైనాడు లో నేత వారు కరువుతో బాధ పడుతుండగా ఆ ఊరిలో బ్రాహ్మణులు ప్రతి పెళ్ళికీ ఒక చీర కొని వారికి కొంత ఉపశమనం కలిగిస్తామని మాట ఇచ్చారు. ఇప్పటికీ సంప్రదాయ అయ్యర్ కుటుంబాల్లో పెళ్ళికూతురిని కూరైనాడు చీరలోనే సి౦గారిస్తారు.