గంగై కొండ చోళపురం లోని దేవాలయం లాగానే శ్రీ అయ్యరప్పార్ దేవాలయం కూడా పురావస్తు ప్రాధాన్యం కలిగినది. చోళ రాజు రాజేంద్ర చోళుడు గంగై కొండ చోళపుర౦లో ఇత్తడి రేకుల మీద చోళ వంశానికి చెందిన చరిత్ర గురించిన శాసనాలు వుండగా, శ్రీ అయ్యరప్పార్ దేవాలయంలో కులోత్తుంగ చోళ రాజుల కాలానికి చెందిన శిలా శాసనాలు వున్నాయి. వారు నిర్వహించిన వేర్వేరు ఉత్సవాలకు కులోత్తుంగ చోళ రాజులు ప్రసిద్ది పొందారు. ప్రతి ఏటా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని నెల కొక్కటి చొప్పున 12 ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహించే వారు.
ఈ గుడి లో ప్రధాన దైవం ధర్మసంవర్ధని, అంటే ధర్మాన్ని సంరక్షించేది అని అర్ధం. ఈ దేవాలయం లో వున కులోత్తుంగ చోళుల నాటి శాసనాలు స్పస్తంగా లేకపోయినప్పటికీ ఆ నాటి వైభవాన్ని ఆ చిత్రాలు కళ్ళకు కడతాయి. వందల ఏళ్ళ వయసుతో పాటు ప్రత్యేకత కలిగిన ఈ గుడి ప్రతి వారిని ఎప్పుడో అనుబంధం కోల్పోయిన ప్రకృతికి తిరిగి కలుపుతున్న అనుభవాన్ని అందిస్తుంది.