కావేరి నది ఒడ్డున తులా ఘాట్ మీద వున్న శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం దక్షిణ కాశీ గా పేరొందింది. విశ్వనాథ స్వామి అంటే విశ్వాన్ని పాలించే వాడు అని అర్ధం – అంటే శివుడు అంత శక్తి సామర్ధ్యాలు కల వాడని అర్థం. వివిధ కారణాల చేత ఉత్తరాభారతంలోని కాశీకి వెళ్ళలేని వారు మైలడుతరై లోని కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం వస్తారు. కాశీ విశ్వనాదుడిని దర్శించుకుని పవిత్ర గంగా నదిలో మునక వేస్తె భక్తుల పాపాలు పోతాయని నమ్ముతారు కాబట్టి భారతదేశంలోని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్లి రావాలనుకుంటారు.
కాశీ లోని గంగా నదిలో దివంగతులైన ఆత్మీయుల అస్థికలు నిమజ్జనం చేస్తే వారి ఆత్మ మరణాంతర ప్రయాణం సుగమం అవుతందని నమ్ముతారు. ప్రగాఢ భక్తుల విశ్వాసం ప్రకారం ఇక్కడ అస్థికలు కలిసిన వారి కోసం శివుడు స్వయంగా ముక్తి మంత్రం చదువుతాడు. కావేరి నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయాన్ని కూడా కాశీ అంత పవిత్రంగా భక్తులు భావిస్తారు. ఈ గుడిలో డు౦డీ వినాయకుడు, భైరవుడితో పాటు పార్వతీ దేవి విగ్రహం కూడా వున్నాయి.