కావేరి నది ఒడ్డున వున్న శ్రీ పరిమళ రంగనాథ స్వామి దేవాలయం ఆళ్వార్లనే విష్ణు భక్తులకు ప్రధానమైన 108 విష్ణ్వాలయాల్లో ఒకటి (వైష్ణవ తిరుపతులు లేదా దివ్య దేశాలు). శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ పరిమళ రంగనాథ స్వామి ఈ గుడిలో పచ్చ రాతితో చేసిన 12 అడుగుల విగ్రహంగా భాసిల్లుతున్నాడు. విష్ణువు అర్ధాంగి పరిమళ రంగనాయకి ని చంద్ర శాప విమోచనవల్లి అనీ, పుండరీక వల్లీ అనీ పిలుస్తారు. ఈ పవిత్ర క్షేత్రంలో అమ్మవారు చంద్రుడిని శాప విముక్తుడిని కావించింది కాబట్టి చంద్ర శాప విమోచనవల్లి అని పిలుస్తారని పురాణ గాథ.
ఈ దేవాలయం కూడా ప్రధానమైనదీ అయినప్పటికీ ఇది పంచ రంగ క్షేత్రం అనే యాత్రామార్గంలో వుంది. పంచ రంగ క్షేత్రాలంటే అయిదు విష్ణువు దేవాలయాలు. కావేరీ నది వెంట శ్రీరంగపట్నం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయం, శ్రీరంగం లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, కుంబకోణం లోని సారంగపాణి దేవాలయం, ట్రిచీ లోని శ్రీ అప్పక్కుడతన్ దేవాలయం, చివరిగా మైలదుతరై లోని శ్రీ పరిమళ రంగనాథ స్వామి దేవాలయం ఈ అయిదు దేవాలయాలు.