మైలదుతరై లో ప్రతి ఏటా నెల రోజుల పాటు జరిగే పండుగ తులా ఉత్సవం. ప్రతి ఏటా పవిత్రమైన ఐప్పసి నెలలో (అక్టోబర్ మధ్య నుంచి నవంబర్ మధ్య) జరిగే ఈ ఉత్సవంలో లక్షలాదిగా కాకున్నా, వేలాదిగా భక్తులు మైలదుతరై వచ్చి పాల్గొంటారు. ఉత్తరాదిన జరిగే కుంభ మేలా లాగానే కావేరి నది ఒడ్డున జరిగే తులా ఉత్సవం దక్షిణ భారతం నుంచి ఎంతో మంది భక్తులను ఆకర్షిస్తుంది. పవిత్ర ఐప్పసి మాసం చివరి రోజున అద్వితీయమైన కడైముగం ఉత్సవం జరుగుతుంది. ఇక్కడి కావేరి జలాల్లో పాప ప్రక్షాళన కోసం వచ్చే భక్తుల పాపాలను స్వీకరించడానికి పవిత్ర గంగా, యమునా, సరస్వతి నదులు కావేరి నదికి వస్తాయని నమ్ముతారు.
ఈ నాలుగు నదులూ ఒక్క చోట కలుస్తాయి కనుక ఆ నీటిలో మునక వేయడం చాల పవిత్రమైనదని భక్తులు నమ్ముతారు. ఐప్పసి మాసం చివరి రోజు మైలదుతరై వీధుల్లో రథోత్సవం జరుగుతుంది. వల్లలార్ దేవాలయం, మయూరనాథ స్వామి దేవాలయం, రంగనాథ స్వామి దేవాలయాల నుంచి దేవతలను ఊరేగింపుగా ప్రత్యేకంగా అలంకరించిన రథాల్లో తీసుకు వెళ్తారు.