మిరామర్ అంటే పోర్చు గీసు భాషలో సముద్రాన్ని చూడటం. ఇక్కడనుండి అరేబియా సముద్రం అతి మనోహరంగా కనపడుతుంది. గోవా రాజధాని పనాజి నుండి ఈ బీచ్ సుమారు 3 కి.మీ.ల దూరం మాత్రమే. ఇది సరిగ్గా మండోవి నది అరేబియా సముద్రంలో కలిసే చోట ఉంది. మిరామర్ బీచ్ లో అనేక హోటళ్ళు కలవు.గోవాలో ఉన్నంత కాలం మీరు ఈ ప్రాంతంలో బస చేయవచ్చు.
మిరామర్ బీచ్ లో ఇసుక బంగారు వన్నె కలిగి ఉంటుంది. తాటి చెట్లు వరుసగా నిలబడి సుందరంగా కనపడతాయి. దీనికిగల రెండు కిలోమీటర్ల తీరం చక్కని నడకకు సరిపోతుంది. ఈ ప్రాంతం సిల్వర్ శాండ్ ప్రాంతంగా ప్రసిద్ధి కెక్కింది. చంద్రుడి వెన్నెల పడిందంటే చాలు ఇసుక మెరిసిపోతూ ఉంటుంది.
మిరామర్ బీచ్ చూడాలంటే నవంబర్ మరియు మార్చి కాలం బాగుంటుంది. ఆ సమయంలో వలస పక్షులు కూడా ఈ ప్రాంతానికి అధికంగా వస్తాయి. దోణా పౌలా మరియు అగుడా కోట మిరామర్ బీచ్ సమీపంలో కలవు. ఈ బీచ్ లో చిన్న చిన్న దుకాణాలు కూడా ఉండి మీ షాపింగ్ కు అనుకూలంగా ఉంటాయి.
మిరామర్ బీచ్ చేరాలంటే, విమానాశ్రయం నుండి పనాజి వెళ్ళే బస్ లేదా టాక్సీలో ప్రయాణించాలి. ఎక్కడికక్కడ బోర్డులు ఉంటాయి కనుక మీ డ్రైవర్ ఈ ప్రాంతాన్ని తప్పించుకునే అవకాశం లేదు.