కొండ ప్రాంతాల్లో ఆకుపచ్చ లోయలు మరియు వంకరగా ఉండే నదులు భారతదేశం యొక్క అన్ని ఈశాన్య రాష్ట్రాల యొక్క ఒక సాధారణ లక్షణంగా చెప్పవచ్చు. మిజోరం ఉత్తర ఏడు సోదరిమణుల కొండలలో ఒకటిగా ఉంది. అలాగే బ్లూ మౌంటైన్స్ మరియు రోలింగ్ కొండలతో ఉన్న ఒక చిన్న అందమైన రాష్ట్రం. మిజో అనే పదంనకు అర్దము కొండ యొక్క వ్యక్తి అని మరియు రామ్ అంటే భూమి అని అర్దము. గతంలో ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. కానీ తరువాత 1986 వ సంవత్సరంలో రాష్ట్రంగా స్థాపించబడింది.మిజోరంమిజోరం పర్యాటక రంగం ప్రకృతిని అన్వేషించడానికి ఒక గొప్ప అవకాశంను అందిస్తుంది. అన్యదేశ వృక్షజాలం మరియు జంతుజాలం, వెదురు అడవులు,పారే జలపాతాలు,అందమైన వరి క్షేత్రాలు అన్నీ ప్రకృతి ప్రియులకు మిజోరం లోయలలో సందర్శించడానికి అద్భుతంగా ఉంటాయి. ఛిమ్తుఇపుఇ లేదా కాలదన్ రాష్ట్రంలో ప్రవహించే అతిపెద్ద నది.ప్రజలు మరియు సంస్కృతిమిజోరాం ప్రజలు రంగురంగుల మరియు నైతిక దుస్తులను ధరించటం పర్యాటకులకు చాలా అందంగానూ మరియు ఆకర్షణీయంగాను ఉంటుంది. వారు 300 సంవత్సరాల క్రితం ఇక్కడే స్థిరపడ్డారని నమ్ముతారు. వారు ఇక్కడ లోతుగా పాతుకుపోయిన సంస్కృతిని మరియు సంప్రదాయాలను అనుసరించటానికి సిద్దంగా ఉంటారు.
మిజోరాం ప్రజలు చాలా సరళమైన సహాయకారిగా మరియు అతిథి సత్కారము చేసె గుణం కలిగి ఉంటారు. ప్రజల యొక్క అధికార భాష మిజో అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రజలు అనుసరించిన ప్రధాన మతం క్రైస్తవ మతంగా ఉన్నది. ప్రజలు చాలా నైపుణ్యం మరియు ఉత్సాహభారితమైన సంగీతం మరియు నృత్యంలో ఆసక్తి కలిగి ఉంటారు. సంగీతం వారి సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. వారు చెక్క మరియు జంతు చర్మంతో చేసిన ఖుంగ్ అని పిలువబడే డ్రమ్స్ ను వాయిస్తారు. మిజోరాం పండుగలు మిజో ప్రజలు ఏడాదిలో పూర్తిగా అనేక ఉత్సవాలకు జరుపుకుంటారు. లుశెఇ,మారా,లై మొదలైన ముఖ్యమైన ఉప తెగలు కొన్ని ఉన్నాయి. గిరిజన పండుగల్లో మిజోరం పర్యాటక రంగం ఒక వైభవం కలిగి ఉంటుంది. వసంతకాల పండుగ చప్చుర్ కుట్ మిజోరం ప్రధాన పండగలలో ఒకటిగా ఉంది. ప్రసిద్ధ వెదురు నృత్యం లేదా చెరవ్ గొప్ప వైభవ ప్రదర్శన మరియు ఓజస్సుతో స్థానిక ప్రజలు చేస్తారు. ఖుయల్ లామ్ అనే ఇంకొక స్థానిక సాంప్రదాయ నృత్యంను వసంతకాలం యొక్క ఆగమనమునకు గుర్తుగా మిజోలు అభ్యసిస్తున్నారు.
ఈ పండుగ సందర్భంగా స్థానిక ప్రజలు నైపుణ్యం కలిగిన చేనేత మరియు హస్తకళాకృతులను ప్రదర్శిస్తారు. మిజోరం ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం అని చెప్పవచ్చు. భూముల కలుపు తీసే సమయంలో కుట్ తల్ఫవుంగ్ అనే పండుగను జరుపుకుంటారు. ఇది అక్కడి ప్రజలకు చాలా ముఖ్యమైన పండుగ.రెఇఎక్ మౌంటైన్ వద్ద జరిగే మూడు రోజుల అన్తురియం ఫెస్టివల్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఈ పండుగ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరుపుకుంటారు. వసంతకాలంలో పూర్తిగా వికసించడంను సూచిస్తుంది. మిజోరంలో మరియు చుట్టూ పర్యాటక స్థలాలుఅతి పెద్ద సరస్సు పాల లేక్ మరియు తమ్ దిల్ లేదా ఆవాలు మొక్కలతో కూడిన సరస్సు మిజోరం పర్యాటనలో ఉన్న రెండు ప్రధాన పర్యాటక ఆకర్షణలు అని చెప్పవచ్చు. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా ఉంది.
లుంగ్లెఇ అనేది మరొక ప్రధాన పర్యాటక కేంద్రం. పర్యాటకులు మిజోరాం మూలాలను అన్వేషించడానికి అనేక పురాతన గుహలు ఉన్నాయి. అంతేకాక దంప వన్యప్రాణుల అభయారణ్యం,ఖవ్ంగ్లుంగ్ వన్యప్రాణుల అభయారణ్యం వంటి అనేక అభయారణ్యాలు ఉన్నాయి.మిజోరం ఒక ట్రెక్కర్ స్వర్గంగా చెప్పవచ్చు. ఫవ్ంగ్పుఇ పర్వతాలు ఉత్తమ ట్రెక్కింగ్ స్థలము అని చెప్పవచ్చు. పారా గ్లైడింగ్ ఈ ప్రాంతంలో ఒక ప్రసిద్ధ అడ్వెంచర్ క్రీడ. మిజోరం యొక్క పర్యాటక శాఖ సహకారంతో పారా గ్లైడింగ్కు కార్యకలాపాలు మరియు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇక్కడ ఒక పారా గ్లైడింగ్ పాఠశాల కూడా ఉంది.మిజోరం వాతావరణము మిజోరాం శీతోష్ణస్థితి మితం కానీ రుతుపవన కాలంలో భారీ వర్షపాతాన్ని పొందుతుంది. శీతాకాలాలు మాత్రం చల్లగా ఉంటాయి. మిజోరంలో వేసవి ఆహ్లాదకరంగా ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత 7 డిగ్రీ సెల్సియస్ నుండి 21డిగ్రీ సెల్సియస్ మద్య ఉంటుంది. అయితే శీతాకాలం కఠినమైనవిగా ఉండవు.