ఈ దేవాలయంలో ఈశ్వరుడి అవతారంగా మహదేశ్వర లింగం కనపడుతుంది. ఈ దేవాలయం దట్టమైన అడవులలో మధ్య భాగంలో చామరాజ్ నగర్ జిల్లాలో ఉంది. అడవుల మధ్యలో ఉండటం వలన భక్తులే కాక, ప్రకృతి అభిమానులు కూడా ఇక్కడకు వచ్చి ఆనందిస్తారు. మహదేశ్వర దేవాలయం చుట్టూ తూర్పు కనుమలలో 77 కొండలు ఉన్నాయి. ఇక్కడి స్ధానికులు జానపద తీరులలో శివ భగవానుడి పాటలు, గేయాలు పాడతారు. భజనలు చేస్తారు.
మలై మహదేశ్వర స్వామి తన పులి వాహనాన్ని అధిరోహించి ఈ ప్రాంతంలో తిరుగుతాడని ఈ కొండపైగల ప్రజలను, రుషులను రక్షించేందుకు అనేక మహిమలు చూపుతాడని స్ధానిక ప్రజలు విశ్వసిస్తారు. ఈ ప్రాంత తెగల ప్రజలు మలై మహదేశ్వర స్వామిని తమ కుటుంబ దైవంగా ఆరాధిస్తారు. వీరిలో కదుకూరుబస్, జేను కురుబలు, మొదలైనవారు ప్రధానులు.
చరిత్ర సాక్ష్యాల మేరకు మలై మహ దేశ్వరుడు 15 వ శతాబ్దిలో ఉండేవాడని విశ్వసిస్తారు. అంతేకాక హరదన హళ్ళి మఠానికి ఆయన 3 వ నేతగా కూడా నమ్ముతారు. ఈ ప్రదేశానికి వచ్చిన భక్తులు, ఇక్కడి సరస్సు అంతరగంగలో పవిత్ర స్నానాలు చేస్తారు.