పంచకుల లోని ఘగ్గర్ నది ఒడ్డుపై ఉన్న గురుద్వారా నాదా సాహిబ్, మొహాలి నుండి షుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ సిక్కు మందిరం. 1688 లో గురు గోవింద్ సింగ్ ఈ ప్రాంతం వద్ద విశ్రాంతి తీసుకున్నారని చెప్తారు, భంగని యుద్ధ౦ తరువాత ఆనందపూర్ సాహిబ్ ఆయన మార్గంలో నడిచారు. నాదు షాహ్ లుబానా అనే గ్రామస్థుడు గురు సాహిబ్, ఆయన అనుచరుల సేవలకు తన్నుతాను అంకితం చేసుకున్నాడు. ఆయన భక్తికి మెచ్చి, గురు గోవింద్ సింగ్ జి ఈ ప్రాంతానికి అతని పేరు పెట్టారు.
తరువాత, భాయి మోతా సింగ్ ఈ స్థలాన్ని కనిపెట్టి, గురు గోవింద్ సింగ్ జి సందర్శన జ్ఞాపకార్ధం ఒక వేదికను ఏర్పాటుచేశాడు. 1956 లో, శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ ఈ గురుద్వారా నియంత్రణను తీసుకుంది. ప్రస్తుతం, ఈ గురుద్వారా నాదా సాహిబ్ ప్రాంగణం రెండంతస్థుల గోపుర నిరమాణం, ఒక పెద్ద దీర్ఘచాతురస్త్రాకార సమావేశ మందిరం, ఒక విశాల ప్రాంగణం, అతిపెద్ద హాలు, యాత్రీకులకు గదులను కలిగి ఉంది. ఈ మనోహరమైన సిక్కు మందిరం, సందర్శకుల కోసం మొహాలి లోని సిఫార్సుచేయబడిన ప్రదేశం.