హర్యానా లోని పంచకుల జిల్లలో ఉన్న మానస దేవి ఆలయం, మొహాలి నుండి దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. మానస దేవికి అంకితం చేసిన ఈ ప్రసిద్ధ హిందూ మందిరం, ఉత్తర భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తి ఆలయాలలో ఒకటిగా లెక్కించబడింది. ఈ ఆలయంలోని దేవత విగ్రహం 1811-1815 సమయంలో మని మజ్ర మహారాజ గోపాల్ సింగ్ చే స్థాపించబడింది. పటియాల అనే మరో మందిరం 1840 లో, ప్రధాన ఆలయం నుండి 200 మీటర్ల దూరంలో అప్పటి పటియాల మహారాజు కరమ్ సింగ్ చే నిర్మించబడింది. నవరాత్రి సమయంలో లక్షలాదిమంది భక్తులతో నిండి ఉండే ఈ పురాతన ఆలయం మొహలి సమీపంలోని తప్పక సందర్శించ వలసిన పర్యాటక ప్రదేశం.