పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అని లాంచనంగా పిలువబడే మొహలి క్రికెట్ స్టేడియం, దేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం లలో ఒకటిగా పేర్కొనబడింది. 1993 లో స్థాపించబడిన ఈ అందమైన క్రికెట్ స్టేడియం పెద్ద క్రికెట్ సాధన, టోర్నమెంట్ మైదానం, 45000 మంది సందర్శకులు పట్టే సీటింగ్ సామర్ధ్యం కలిగిఉండడం తోపాటు ప్రపంచ ప్రసిద్ధ సౌకర్యాలను కూడా కలిగిఉంది. మొహాలి క్రికెట్ స్టేడియం కూడా రాష్ట్ర క్రికెట్ ఆటగాళ్ళ శిక్షణ కోసం ఉన్న కొన్ని ఉత్తమ ప్రదేశాలలో లెక్కించబడింది.
1993, నవంబర్ 22 న జరిగిన హీరో కప్ సమయంలో ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య నిర్వహించిన వన్-డే అంతర్జాతీయ మాచ్ ఈ స్టేడియంలో మొట్టమొదట నిర్వహించబడి నిజమైన సాక్ష్యంగా ఉంది. 1994 డిసెంబర్ లో ఇండియా, వెస్ట్ ఇండీస్ మధ్య మొదటి టెస్ట్ మాచ్ ఈ మొహాలి క్రికెట్ స్టేడియం వద్దే జరిగింది. ఈరోజు, ఈ స్టేడియం IPL టీం, పంజాబ్ XI కింగ్స్ కి నిలయంగా ఉంది. చండీగర్ శివార్లలో ఉండడం వల్ల మొహాలి క్రికెట్ స్టేడియం పర్యాటకులు తప్పక సందర్శించాల్సిన స్థలం.