నగరంలో అత్యంత అద్భుతమైన మందిరాలలో ఒకటైన రాంభాగ్ ధాం కైతల్ గ్రామానికి సమీపంలో రాంభాగ్ రహదారిపై ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఈ ఆలయం పార్వతీదేవి వారసులైన నౌ దేవీస్ లేదా తొమ్మిది దేవతలకు అంకితం చేయబడింది.
ఈ ఆలయ గర్భగుడిలో ఎనిమిది ఇతర దేవతలతోపాటు దుర్గా దేవి విగ్రహం ఉంది. ఈ ఆలయంలోని ఇతర గదులలో హనుమాన్ జి, జ్వాల జి, రాధాకృష్ణ తోపాటు ఇతర దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి.
ఈ ఆలయం ప్రవేశ ద్వారంపై రాం దర్బార్ కనిపిస్తుంది, ఇది క్షుద్ర శక్తులనుండి ఈ ఆలయాన్ని రక్షిస్తుందని నమ్మకం. ఈ ఆలయం చుట్టూ మరేఇతర రక్షణ సదుపాయం లేదు.
ఈ ఆలయం పండుగ రూపాన్ని అందించే రంగుల కాంతులతో ప్రత్యేకంగా అలంకరించబడే నవదుర్గా, నవరాత్రి పండుగల సమయంలో ప్రత్యేకంగా జరిగే ధార్మిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.