జమ మసీదు హంసఫర్ మారేజ్ హాలుకి ఎదురుగా ఉంది, ఇది మొరాదాబాద్ జిల్లాలోని బక్యిపూర్ గ్రామంలో ఉంది. గంగానది ఎదురుగా ఉన్న ఈ మసీదుని 1631 లో రుస్తం ఖాన్ నిర్మించారు. జామా మసీదు, డిల్లీ లోని ఎర్రకోట, ఆగ్రా లోని తాజ్ మహల్ వంటి అద్భుతమైన కట్టడాల నిర్మాణం మొఘలుల నిర్మాణ శైలికి గొప్ప చిహ్నాలు. ఈ పెద్ద భవనాల వద్ద ప్రతిరోజూ ఐదుసార్లు ప్రార్ధనలకు ఉపయోగించే విశాలమైన ప్రాంగణం ఉంది.