పాటలేశ్వర్ ఆలయం సదత్బడి అనే ఒక కుగ్రామంలో ఉంది, ఇది మొరాదాబాద్-ఆగ్రా రహదారిపై బహ్జోయి నుండి షుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శివునికి అంకితం చేయబడింది, ఈయన పాలు, గంజాయి ధతురా తో భక్తుల అన్నిరకాల కోరికలను తీర్చేఒక ఉదార దేవుడు అని ప్రజల నమ్మకం.
అయితే, ఈ ప్రాంత నివాసులు, ఉదారం, ఔదార్యం గల దేవునికి చెల్లించడానికి వివిధ సమర్పణల జాబితాలో మరో అంశాన్ని చేర్చారు. అనేక నైవేద్యాలతో కూడిన వివిధ వస్తువులలో, చీపురు కూడా వాటిలో ఒకటిగా కలిసిఉంది.
పాటలేశ్వర్ ఆలయంలోని శివునికి చీపుర్లు నైవేద్యంగా సమర్పిస్తే అన్నిరకాల చర్మ రోగాలు నయమౌతాయని వారి నమ్మకం. వారు చేయవలసిందల్లా వారు రోగంతో బాధపడేటపుడు చీపురుని అందించాలని ఒక ప్రతిజ్ఞ చేసారు.
అందువలన, ఈ శతాబ్ద కాలంనాటి పురాతన ఆలయం అనేక చర్మ రోగులను భారీగా ఆకర్షిస్తుంది. శివుని పూజకోసం పవిత్రంగా భావించే సోమవారం రోజు భక్తుల సమూహం ఎక్కువగా ఉంటుంది.