మౌంట్ అబూ లోని ముఖ్య ధార్మిక ప్రాంతాలలో అధర్ దేవి ఆలయ ప్రాంగణంలో గల పవిత్రమైన దూద్ బవోరి బావి ఒకటి. ఈ బావి లోని నీరు పాల వంటి రంగులో ఉన్నందున ఈ బావిని దూద్ బవోరి అంటారు. ఈ బావి లోని నీటి రంగుకి సంబంధించి అనేక పురాణగాధలు వున్నాయి.
అటువంటి ఒక కథనం ప్రకారం ఈ బావి దేవతలకు పాలు అందించే ప్రధాన వనరు. అనేక మంది స్థానికులు ఈ బావి లోని నీటిని పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ బావి లోని నీరు కొన్ని మంత్ర శక్తులను కల్గి ఉన్నాయని కూడా నమ్ముతారు. అనేక మంది భక్తులు ఈ బావిని దివ్య గోమాత కామధేనువుగా భావిస్తారు.