ఆరావళి పర్వత శ్రేణులలో మౌంట్ అబూ నుండి 15 కి. మీ. దూరంలో గల ఎత్తైన పర్వత శిఖరం గురు శిఖర్ పీక్. ఇది 1722 మీ. ల ఎత్తు లో వుంటుంది. ఈ అధ్భుతమైన పర్వత శిఖరం పర్యాటకుల పర్వతారోహణ కు ప్రసిద్ది చెందింది. ఈ పర్వత శిఖరం పై నుండి పర్యాటకులు ఆరావళి పర్వత శ్రేణులలోని అన్ని పర్వతాలతో బాటు పక్షులను కూడా చూసి ఆనందించవచ్చు.
ఈ పర్వత శిఖరంలో ప్రాచీన గురు దత్తాత్రేయ దేవాలయాన్ని చూడవచ్చు. ఈ దేవాలయం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతార౦గా భావించే గురు దత్తాత్రేయునికి చెందినది. శివాలయం, మీరా దేవాలయం, చాముండి దేవాలయం వంటి కొన్ని ఇతర దేవాలయాలు ఈ శిఖరం పై ఉన్నాయి. దేవాలయాల తో బాటు ఖగోళ వస్తువులను పరిశీలించే౦దుకు భూఆదారిత పరారుణ పరిశోధన నిమిత్తం మౌంట్ అబూ అబ్సర్వేటరీ ఏర్పాటయింది. ఈ పరిశోధనశాల ఫిజికల్ రిసర్చ్ లేబరేటో రి నిర్వహణ లో ఉంది.