నక్కి సరస్సు ఒడ్డున వున్న శ్రీ రఘునాథ్ జి దేవాలయం మౌంట్ అబూ లోని ప్రముఖ ధార్మిక ఆకర్షణ. ఈ దేవాలయాన్ని14 వ శతాబ్దంలో హిందూ పండితుడు శ్రీరామానంద్ నిర్మించాడని అంటారు. హిందూ మతం లోని వైష్ణవ శాఖ కు చెందిన అనేక మంది భక్తులు ఈ వైష్ణవాలయాన్ని సందర్శిస్తారు. ఈ దేవాలయంలో అందంగా చెక్కిన శాసనాలు, గోడలపై గల జటిలమైన చెక్కడాలు మేవార్ సంప్రదాయం, నిర్మాణ వారసత్వానికి అసాధారణ ఉదాహరణ.శ్రీ రఘునాథ్ జి అద్భుతమైన విగ్రహం ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణ. భక్తులతో బాటు అనేక మంది పర్యాటకులను ఈ దేవాలయం ప్రతి రోజు ఆకర్షిస్తుంది. నక్కి సరస్సును సందర్శించే పర్యాటకులు అద్భుత వాస్తు నిర్మాణమైన ఈ దేవాలయాన్ని తప్పనిసరిగా చూడాలి.