1972 లో స్థాపించబడిన తెప్పకడు ఏనుగు శిబిరం, నిరోధిత వాతావరణంలో ప్రకృతిలో అతిపెద్ద భోమి జంతువుతో కలవడానికి సందర్శకులను అనుమతిస్తుంది. ప్రస్తుతం 23 ఏనుగులు ఈ శిబిరంలో కలవు. ప్రతిరోజూ, ఒక ఏనుగులజంట నిర్మాణం లోపల ఉన్న వినాయకుడికి పూజ చేస్తాయి. తెప్పకడు ఏనుగు శిబిరంలో తెల్లవారుజామున ఏనుగు రైడ్ లు ఉంటాయి, అదేవిధంగా సాయంత్రం పూట కూడా జరుగుతాయి. సాయంత్రం సమయంలో, ఏనుగుల సాధారణ మేతకు వెళ్ళే సమయం, సందర్శకులను ఇది చూడడానికి స్వాగతిస్తారు. సంవత్సరానికి లక్షకంటే ఎక్కువమంది వచ్చే ఈ శిబిరం మందపాటిచర్మం గల భూమిపై ఉన్న జంతువుల గురించి అవగాహనను వ్యాప్తిచేయడం కోసం ఒక ముఖ్యమైన విద్య కేంద్రంగా సేవలను అందిస్తుంది. తెప్పకడు ఏనుగు శిబిరం, పర్యావరణ పర్యాటకానికి, కాపలాకాయుటకు, మనిషి-ఏనుగు విభేధాలని పరిష్కరించడానికి, జంతువుల గురించి అవగాహనను ప్రోత్సహిచడానికి ప్రధానంగా ఉపయోగిస్తారు.
సమయం: ఉదయం 5.30 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు
ప్రవేశ రుసుము: 20 రూపాయలు