ముక్తేశ్వర్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. కాటేల్ ప్లేగ్ కమిషన్ యొక్క సలహాని పాటిస్తూ 1893 లోఈ సంస్థ ప్రారంభమయింది. ఆ కాలం లో స్థానికులని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఆనిమల్ డిసీస్ ల తో పోరాడడానికి ఈ సంస్థ ఏర్పాటయింది. దేశం లో నే ప్రముఖ పరిశోధనల కేంద్రాలలో ఒకటైన ఈ సంస్థ జంతువుల పోషణ, జీవాణు విజ్ఞానం మరియు జన్యు శాస్త్రం వంటి వాటిపైన పరిశోధనలు నిర్వహిస్తుంది. ఈ కాంపస్ లో ఉన్న లైబ్రరీ మరియు మ్యూజియాలని కూడా పర్యాటకులు సందర్శించవచ్చు. బ్రిటిష్ నిర్మాణ శైలి ని తలపించే ఈ అందమైన కాంపస్ లో పర్యాటకులు షికారు చెయ్యవచ్చు.