శివ టెంపుల్ మరియు ముక్తేస్వర్ ధం గా ప్రసిద్ది చెందినా ముక్తేస్వర్ టెంపుల్ ఈ ప్రాంతం లో ఉన్న ప్రసిద్దమైన ఆధ్యాత్మిక కేంద్రం. సముద్ర మట్టం నుండి 7000 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. దాదాపు 350 సంవత్సరాల క్రితానికి సంబంధించిన ఈ ఆలయం హిందువుల దేవుడు అయిన మహా శివుడికి అంకితమివ్వబడినది. హిందువులకి అత్యంత పవిత్రమైన ఆలయం ఇది.
తెల్లటి పల రాతి శివ లింగం ఈ ఆలయం లో ప్రతిష్టింపబడినది. ఈ శివ లింగం చుట్టూ విష్ణు, బ్రహ్మ, గణేష్, హనుమాన్, నంది మరియు పార్వతి వంటి వివిధ హిందూ దేవుళ్ళ మరియు దేవతలా విగ్రహాలు ఉన్నాయి. ఏటవాలుగా ఉన్న కొన్ని రాతి మెట్లు ఎక్కడం ద్వారా భక్తులు ఈ ఆలయానికి చేరుకోవచ్చు.