ప్రసిద్ధి గాంచిన శిల్పకళా అద్భుతం గేట్ వే ఆఫ్ ఇండియా దాని 8 అంతస్తుల ఎత్తుతో ముంబై లోని కొలబాలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనిని హిందు మరియు ముస్లిం శిల్పశైలులుగా కలిపి నిర్మాణం చేశారు. 1911 లో ఆ నాటి రాజు సందర్శనలో గుర్తుగా దీనిని నిర్మించారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిలుచుని మీరు ఒక ఫొటో తీయించుకోకపోతే మీ ముంబై ట్రిప్ వృధాగా భావించాల్సిందే. గోట్ వే ఆఫ్ ఇండియా కొలబా కాజ్ వే కు సమీపంలోనే ఉంటుంది. ఇక్కడకు దక్షిణ ముంబై లో ప్రసిద్ధి గాంచిన రెట్టరెంట్లు బడే మియాస్, కేఫే మండేగర్ మరియు కేఫే లియో పోల్డ్ కూడా సమీపంగానే ఉంటాయి.