ఛత్రపతి శివాజి స్టేషన్ అనే పేరు కంటే కూడా వి.టి. స్టేషన్ లేదా విక్టోరియా టర్మినస్ అనే పేరుతో ముంబై లోని ప్రధాన వాణిజ్య కేంద్రం ఇప్పటికి ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతోంది. పట్టణ యువత అవసరాల కారణంగా ఇక్కడ కన్ స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సంబంధిత మరియు దుస్తులు వంటివి ఈ ప్రాంతంలోని వీధులలోకి వచ్చేసాయి. దక్షిణ ముంబై లో దిగిన పర్యాటకులు హోటల్ నుండి కొద్దిపాటి నడక సాగిస్తే చాలు పుస్తకాలు, స్టాంపులు, 17వ శతాబ్దం నాటి పురాతన నాణేలు వంటివి ఎన్నో వస్తువులు కొనుగోళ్ళు చేయవచ్చు.