దత్తాత్రేయ దేవాలయం మురుద్ లోని ఒక కొండపై నిర్మించబడింది. ఇక్కడి దత్తాత్రేయ విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉండి హిందూ దేవుళ్ళు అయిన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల తలలు కలిగి ఉంటుంది. ఈ దేవాలయాన్ని స్వామి బ్రహ్మేంద్ర కనుగొన్నారు. ఆయన అనేక శతాబ్దాల కిందట అక్కడి లోయలో ఒక పాదుకను కూడా కనుగొన్నారు. ఆ పాదుకను నేటికి భక్తులు పూజిస్తూంటారు.