మైసూర్ సందర్శకులు అందమైన జయలక్ష్మీ విలాస్ మేన్షన్ లోని ఫోక్ లోర్ లేదా జానపదుల మ్యూజియం తప్పక సందర్శించాలి. ఈ మ్యూజియం 1968 లో రూపొందించబడింది. జానపదులకు సంబంధించిన షుమారు 6500 వస్తువులు, ప్రదర్శనకు ఉంచబడ్డాయి. దక్షిణ భారత దేశంలోని ఆటవస్తువులు, ఇంటి సంబంధిత వస్తువులు వీటిలో ఉన్నాయి. వీటితోపాటు, డ్యాన్స్, డ్రామా, మ్యూజిక్ లకు సంబంధించిన వివిధ వస్తువులు కూడా ప్రదర్శిస్తున్నారు.