పర్యాటకులు జయలక్ష్మీ విలాస్ భవనాన్ని తప్పక చూడాలి. మైసూర్ లోని వారసత్వ భవనాలలో ఇది చాలా అందమైనది. దీని చుట్టూ అందమైన పచ్చటి మైసూర్ విశ్వవిద్యాలయ కేంపస్ మానసగంగోత్రి కలదు. ఇది ఒక కొండపై కుక్కరహళ్ళి సరస్సుకు పడమటి వైపు కలదు. దీనిని క్రిష్ణరాజ ఒడయార్ IV కాలంలో రాజు చామరాజ ఒడయార్ పెద్ద కుమార్తె జయలక్ష్మీ అమ్మణి కొరకు 1905లో నిర్మించారు. నిర్మాణ ఖర్చు ఆ కాలంలో రూ. 7 లక్షలు కాగా 2002 లో మరోమారు రూ.1.17 కోట్లతో మరమ్మతులు చేశారు. మరమ్మతుల తర్వాత 2006లో కర్నాటక గవర్నర్ దీనిని ఆవిష్కరించారు. ఇది సుమారు 6 ఎకరాలలో ఉండి ప్రతి వైపు ప్రవేశం కలిగి ఉంటుంది. దీనికి సుమారు 300 కిటికీలు, 125 గదులు కలిగి 287 అందంగా చెక్కిన ద్వారాలు కలవు. ఈ భవనం కలప, ఇనుము, ఇటుక మరియు మోర్టార్ లతో నిర్మించారు.