మైసూర్ జూ ను 1892 లో మహారాజ చామరాజ ఒడయార్ నిర్మించారు. దేశంలోని ప్రధాన జూ లలో ఇది ఒకటి. దీనిని సుమారు 250 ఎకరాలలో నిర్మించి వివిధ రకాల జంతువులు, పక్షులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. దీనిని మొదటిలో ప్యాలెస్ జూ అనేవారు. 1909 సంవత్సరంలో దీనిని శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్ గా పేరు మార్చారు. కనుమరుగయ్యే జంతు జాతుల అభివృధ్ధికి ఈ జంతు ప్రదర్శన శాల అధికంగా నిర్వహిస్తున్నారు. చిన్న ఏనుగులు, కోతులు, పులులు, చిరుతలు వంటివి చూడవచ్చు. అంతేకాక, బార్బెరీ గొర్రెలు, జీబ్రా, జిరాఫీ, ఎము, చింపాంజి, హిప్పో, కంగారూ, టైగర్, సంగై వంటివి కూడా పర్యాటకులు చూడవచ్చు. నాలుగు కొమ్ముల దుప్పి కారకల్, సివెట్, నీలగిరి కోతి, చింకారా వంటివి కూడా కలవు.