ఈ రీసెర్చి సంస్ధను 1891 లో స్ధాపించారు. పురాతన గ్రంధాల ప్రచురణకై దీనిని స్ధాపించారు. దీనిలో సుమారు 33,000 తాళ పత్ర గ్రంధాలు కలవు. దీనిని మొదటిలో విద్యా శాఖ ప్రారంభించినప్పటికి తర్వాత మైసూర్ యూనివర్శిటీ నిర్వహిస్తోంది. 1943 లో దీనిని ఓరియంటల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ అని నామకరణం చేశారు.
ఈ సంస్ధ అన్ని పని దినాలలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మరియు సెలవు దినాలలో ఉదయం 10 గం. నుండి సా. 5.30 గం. వరకు తెరచి ఉంటుంది.